ముంబైతో మ్యాచ్… చెన్నైకి కీలక ఆటగాడు దూరం !

-

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి భారీ ఎదుటి దెబ్బ తగిలింది.ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ ,ముంబై ఇండియన్స్ మధ్య 29వ మ్యాచ్ జరగనుంది.అయితే గాయం కారణంగా ఇప్పటికే 2 మ్యాచులకు దూరమైన చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ పతిరణ ఇవాళ ముంబై ఇండియన్స్ తో మ్యాచులో ఆడటం కష్టమేనని చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ ఫ్లెమింగ్ తెలిపారు.

పతిరణ గాయం అంత పెద్దదేమీ కాదు. త్వరలోనే అతడు మైదానంలోకి వస్తాడు అని ఆశా భావం వ్యక్తం చేశారు. కానీ ఆయనకు కొంత విశ్రాంతి అవసరం. వంద శాతం ఫిట్గా ఉన్నప్పుడే తీసుకొస్తాం. లేదంటే అతడు మళ్లీ గాయపడితే కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది’ అని ఆయన తెలిపారు. కాగా, చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన ఐదు మ్యాచ్లలో మూడుంట గెలిచి పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో కొనసాగుతుంది. ఇక ముంబై ఇండియన్స్ ఆడిన ఐదు మ్యాచ్లలో రెండు ఇంటర్ విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version