కారు ద‌గ్దం కేసులో షాకింగ్ విష‌యాలు.. ఆ కార‌ణం వ‌ల్లే కిరాత‌కంగా.. !

-

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మండల పరిధిలో కారు దగ్ధం కేసును మెదక్ జిల్లా పోలీసులు చేదించారు.
వ్యాపార లావాదేవీల‌ కారణంగా హ‌త్య జ‌రిగిన‌ట్టు పోలీసులు నిర్ధారించారు. కోటిన్న‌ర రూపాయ‌ల‌ వ్యవహారంలో ధర్మపురి శ్రీనివాస్ కి మరొకరికి మధ్య విభేదాలు ఉన్న‌ట్టు గుర్తించారు. లోన్ తీసుకొని డబ్బులు ఇచ్చినా శ్రీనివాస్ తిరిగి చెల్లించలేదనే కోపంతో దుండగులు హ‌త్య చేసిన‌ట్టు గుర్తించారు. సాయంత్రం 4:30 కి రామాయంపేట రూట్ లో కిరాతకంగా హత్య చేసి పదిన్నరకి దుండగులు కారు ద‌గ్దం చేశారు.

medak muderder case

ప్ర‌స్తుతం పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు ఉన్నారు. కారులోనే దుండ‌గులు క‌త్తితో హ‌త్య చేశార‌ని పోలీసులు గుర్తించారు. హ‌త్య చేసిన అనంత‌రం దుండ‌గులు కారులోనే ఆరు గంట‌ల పాటు తిరిగారు. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు నింధితుల‌ను పోలీసులు మీడియా ముందు ప్రేవేశపెట్ట‌నున్నారు. ఈ కేసులో మెదక్ జిల్లా పోలీసులు నింధితుల‌ను చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించి పట్టుకున్నారు. మ‌ర్డ‌ర్ జ‌రిగ‌న ఒక్క‌రోజులోనే ఆధారాల‌తో స‌హా నింధితుల‌ను అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version