ప్రగతి భవన్ లో కేసీఆర్ మంత్రులతో సమావేశం..ఆ నేతలకు షాక్‌ !

-

తెలంగాణ సీఎం కేసీఆర్‌.. పాలన, పార్టీ పటిష్టంపై ఫోకస్‌ చేసినట్లు సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే.. ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ప్రగతి భవన్‌ లో టీఆర్‌ఎస్‌ మంత్రులతో… అత్య వసర సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇప్పటికే అందరూ మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్‌. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ప్రగతి భవన్‌ లో ఈ సమావేశం జరుగనుంది.

KCR-TRS

ఇక ఈ కీలక సమావేశం లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన పై చర్చ నిర్వహించే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం అందుతోంది. 12 మందిలో కొందరు అభ్యర్థులను మార్చే అవకాశం కూడా కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ నెల 23 నామినేషన్ కు ఆఖరు ఉండటం తో… ఈ సమావేశం నిర్వహించ నున్నారు. అగ్ర కులాల వారికి పదవులు ఇస్తున్నారనే ప్రచారం సాగుతుండటంతో.. దానిపై కూడా ఇవాళ చర్చించే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ సమావేశం లో కొంత మంది నేతలకు కేసీఆర్‌ షాక్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news