మెగా డీఎస్సీ అంటూ మెగా మోసం: వైసీపీ

-

మెగా డీఎస్సీ అంటూ టీడీపీ మెగా మోసానికి పాల్పడుతోందని వైసీపీ మండిపడింది. ’25 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ఎన్నికల ప్రచారంలో గొప్పలు చెప్పారు. తొలి సంతకంతో 16,347 పోస్టులకు మెగా డీఎస్సీ అంటూ డ్రామాలు ఆడుతున్నారు. అందులో 6,100 పోస్టులు వైఎస్ జగన్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చినవే’ అని వైసీపీ ట్వీట్ చేసింది.

కాగా, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈరోజు సీఎంగా బాధ్యతల చేపట్టిన వెంటనే చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీ ఫైల్ పై తొలి సంతకం చేశారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ ఫైల్ పై సంతకం చేశారు.బాధ్యతలు చేపట్టిన వెంటనే మెగా డీఎస్సీ ఫైల్ పై సంతకం చేశారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పై రెండో సంతకం చేశారు. పింఛన్లు రూ.4వేలు పెంచుతూ ఫైల్ పై మూడో సంతకం చేశారు. అలాగే అన్న క్యాంటిన్ పున:ప్రారంభం పైల్ పై నాలుగో సంతకం, నైపుణ్య గణనపై 5వ సంతకం చేశారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news