కంట తడి పెట్టించిన హీరోయిన్ సీమంతం.. భర్త చనిపోవడంతో కటౌట్ సమక్షంలో !

-

ప్రముఖ కన్నడ హీరో చిరంజీవి సర్జా ఈ ఏడాది మొదట్లో ఆకస్మికంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. శ్వాస కోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ ఆయన కన్ను మూశారు. ఆయన హీరోయినా మేఘనను వివాదం చేసుకున్నారు. చిరంజీవి సర్జా చనిపోయే నాటికి మేఘనా రాజ్ గర్భవతి. తాజాగా మేఘన సీమంతం వేడుకలను చిరంజీవి కుటుంబ సభ్యులు ఘనంగా జరిపించారు. అయితే ఎందరు ఉన్నా భర్త లేని లోటు ఎవరూ తీర్చలేనిది.

అందుకే ఈ వేడుకలో మేఘనా రాజ్ కూర్చున్న కుర్చీ పక్కన ఆమె భర్త కటౌట్‌ ని ఉంచి కొంతలో కొంత ఆయన లేని లోటును తీర్చారు. కరోనా కారణంగా ఈ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కాగా, వారు మేఘనాని ఆశీర్వదించారు. ఇక మేఘన సీమంతం వేడుకల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటిని చూసిన చిరంజీవి సర్జా అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు. కొందరు అయితే కన్నీళ్లు కూడా పెట్టుకుంటున్నారు. హీరోయిన్ మేఘన తో పదేళ్లు ప్రేమలో చిరంజీవి సర్జా 2018లోనే మేఘనను వివాహం చేసుకున్నారు. అయితే రెండేళ్ళు కూడా కలిసి జీవించకుండానే ఆమెకు దూరమయ్యాడు. సీనియర్‌ హీరో అర్జున్‌కు మేనల్లుడు ఈ చిరంజీవి సర్జా.

Read more RELATED
Recommended to you

Latest news