తెలంగాణలోని ఈ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్

-

తెలంగాణలోని రెండు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం ఉదయం లోపు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.

ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పైన తెలిపిన రెండు జిల్లాలతో పాటు కరీంనగర్, ములుగు, వరంగల్, హన్మకొండ, పెద్దపల్లి, భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్,సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news