మోడీని పాతబస్తీలోకి రమ్మనండి చూద్దాం.. ఒవైసీ సవాల్..!

-

జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం బిజెపి ఎంఐఎం పార్టీ నేతల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ఇటీవల ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. జిహెచ్ఎంసి ఎన్నికలలో భాగంగా నరేంద్ర మోడీ ని తీసుకొచ్చి పాతబస్తీలో ప్రచారం నిర్వహించాలి అంటూ సవాల్ విసిరారు. నరేంద్ర మోడీ పాత బస్తీకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో నరేంద్ర మోడీతో సభ కూడా ఏర్పాటు చేయండి బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుందో చూద్దాం అంటూ వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ ను నాశనం చేయాలనే ఉద్దేశంతోనే బిజెపి తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారాన్ని మొదలు పెట్టింది అంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. అంతేకాకుండా గతంలో పాతబస్తీలో రోహింగ్యాలు పాకిస్తానిలు ఉన్నారు అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఓవైసీ… ఈ వ్యాఖ్యలకు ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షా ని బాధ్యులు అంటూ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ సొర పడుతుంటే కేంద్రం నిద్రపోతున్నదా అంటూ ప్రశ్నించారు

Read more RELATED
Recommended to you

Exit mobile version