ఆడపిల్లలనే వీధుల్లోకి పంపొద్దు.. పవన్‌ కల్యాణ్ ఉన్నాడు : అమర్‌నాథ్‌

-

ఏపీలో ఒక్కసారి రాజకీయం వేడెక్కింది. నిన్న జరిగిన విశాఖ గర్జన తరువాత విశాఖలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే.. తాజాగా ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ విశాఖలో ఉన్నంతవరకు పెళ్లికాని ఆడపిల్లలు దయచేసి బయటికి రావొద్దని అన్నారు. పెళ్లయినవాళ్లకు కూడా కట్టేస్తాడేమోనని తనకు భయంగా ఉందని, పెళ్లికాని వాళ్లే కాదు, అసలు ఆడపిల్లలనే వీధుల్లోకి పంపొద్దని మంత్రి అమర్ నాథ్ తెలిపారు.

షరతులు వర్తిస్తాయి అనే లెక్కలో పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లపై ఇప్పటికే తన విధానాన్ని చెప్పాడని, అందుకే విశాఖలో అమ్మాయిలను బయటికి రావొద్దని చెబుతున్నానని వివరణ ఇచ్చారు. ఇప్పటికే విశాఖపట్నం పవన్ కు ఓసారి పిల్లనిచ్చిందని గుర్తుచేశారు అమర్‌నాథ్. ఉగ్రవాద మనస్తత్వం కలిగిన ఇలాంటివారు మన రాష్ట్రంలో అధికారం చెలాయించాలని రావడం దురదృష్టకరం వ్యాఖ్యానించారు అమర్‌నాథ్. పవన్ ఇకనైనా పెట్టె, బేడా సర్దుకుని షూటింగ్ లకు వెళ్లిపోతే మంచిదని అన్నారు అమర్‌నాథ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version