వేడినీళ్లు తాగితే క‌రోనా పోతుంది.. మంత్రి ఎర్ర‌బెల్లి వ్యాఖ్య‌లు.. వైర‌ల్ వీడియో..!

-

క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ఇంకా మ‌న దేశంలోకి రాక‌ముందు ప‌లువురు నేత‌లు ఆ వైర‌స్‌పై తెలిసీ తెలియ‌ని వ్యాఖ్య‌లు చేసి.. ఆ త‌రువాత నాలుక క‌రుచుకున్నారు. అయితే ఇప్పుడు ప‌రిస్థితి వేరే. మ‌న‌కు క‌రోనా ఎలా వ‌స్తుంది.. ఎలా వ్యాప్తి చెందుతుంది.. దాని ల‌క్ష‌ణాలు, చికిత్స ఏమిటి ? అన్న వివ‌రాలు దాదాపుగా అంద‌రికీ తెలుసు. కానీ కొంద‌రు నేత‌లు మాత్రం ఇంకా ఏమీ తెలియ‌న‌ట్లు మాట్లాడుతూ అన‌వ‌స‌రంగా అభాసుపాల‌వుతున్నారు. అందుకు మంత్రి ఎర్ర‌బెల్లి క‌రోనాపై మాట్లాడిన మాట‌లే తాజా ఉదాహ‌ర‌ణ‌.

minister errabelli comments on corona virus

మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ప్ర‌జ‌ల‌తో నిర్వ‌హించిన ఓ స‌భ‌లో మాట్లాడుతూ.. క‌రోనా వైర‌స్ గొంతులో ఉంటుంద‌ని.. వేడి నీళ్లు తాగితే పోతుంద‌ని.. అక్క‌డి నుంచి ఆ వైర‌స్ క‌డుపులోకి వెళ్తుంద‌ని.. దాంతో అది కింద‌కు వెళ్తుంద‌ని.. అన్నారు. మ‌న క‌డుపు ఓ మ‌హాయంత్ర‌మ‌ని, బొక్క‌ల‌ను కూడా అరిగించుకుంటుంద‌ని వ్యాఖ్య‌లు చేశారు. కాగా ప‌లువురు అధికారులు, ప్ర‌జా ప్ర‌తినిధుల స‌మ‌క్షంల‌నే ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

ఇక మంత్రి ఎర్ర‌బెల్లికి చెందిన ఆ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై ఆ మంత్రి ఏమ‌ని స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news