త్వరలో టీడీపీకి మరో బిగ్ షాక్…?

-

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో తెలుగుదేశం పార్టీకి మరో దెబ్బ తగిలే అవకాశాలు కనపడుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు రాజకీయంగా చాలా వరకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో కీలక నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీకి షాక్ ఇవ్వగా తాజాగా మరో సీనియర్ నేత జగన్ సమక్షంలో వైసీపీలో జాయిన్ అయ్యారు.

ఇక అగ్ర నేతలు మరి కొందరు ఇప్పుడు బిజెపితో పాటుగా వైసీపీతో కూడా టచ్ లో ఉన్నారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. కొందరు కీలక నేతలను వైసీపీలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ తో ఇప్పటికే మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చర్చలు కూడా జరుపుతున్నారు. ఆయనతో పాటుగా మరో మంత్రి కూడా గొట్టిపాటి తో చర్చలు జరుపుతున్నారు.

త్వరలోనే గొట్టిపాటి తో పాటుగా ఆయనకు చెందిన కొన్ని వర్గాలు కూడా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. ప్రస్తుతం టీడీపీ బలపడే అవకాశాలు లేకపోవడం జగన్ యువనేత కావడంతో ఇప్పుడు టీడీపీ ని వీడే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అగ్ర నేతలు అందరూ కూడా తలోదారి చూసుకునే సూచనలే ఉన్నాయి అనేది అర్ధమవుతుంది. మరి ఎంత మంది మారతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news