నువ్వు చూపించిన చెప్పైనా నీదేనా?.. నీ యజమాని కొనిచ్చాడా? – మంత్రి జోగి రమేష్ కౌంటర్

-

ముసుగు వీరుల ముసుగు కొన్ని నిమిషాల ముందు తొలగిపోయిందని అన్నారు గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్. ఎప్పటి నుంచో మేము చెప్తున్నాం…ముసుగు దొంగలు ఇద్దరు ఒకచోట చేరిపోయారని అన్నారు. ప్రజలకి కూడా వీళ్ళ నిజస్వరూపం తెలిసిపోయిందన్నారు. ఇప్పుడూ చెప్తున్నా…. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ కళ్యాణ్ అని వ్యాఖ్యానించారు. ప్యాకేజ్ “స్టార్” అనడం కూడా కొంత ఇబ్బందేనన్న జోగి రమేష్.. సినిమాలో నటించే విధంగానే ఇక్కడ కూడా నటిస్తున్నాడని ఎద్దేవా చేశారు.

 

ప్యాకేజీ తీసుకోకపోతే దమ్ముగా ఎప్పుడైనా నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పావా? అని ప్రశ్నించారు. సినిమా డైలాగులు ఎక్కడ చెప్పాలో తెలియక ఇక్కడ మాట్లాడుతున్నాడని అన్నారు. నువ్వు చూపిన చెప్పైనా నీదా…? నీ యజమాని కొనిచ్చాడా..? అని ప్రశ్నించారు. 2019లో మిమ్మల్ని చెప్పులు అరిగేటట్లు చెంపలు చెల్లు మనిపించారని మండిపడ్డారు జోగి రమేష్. ఎన్నికల్లో చేసింది ఎంటి… యుద్ధం కాదా… ఓడిపోలేదా..? అన్నారు. నిన్న ఎక్కువ ప్యాకేజీ వచ్చినట్లుంది… ఎక్కువ మాట్లాడేశాడని కౌంటర్ వేశారు.

విశాఖ గర్జన సక్సెస్ అయితే అక్కడ మాపై దాడి చేయించాడని ఆరోపించారు. ఈ రోజు ఆ సైకొలను మరింత రెచ్చగొట్టాడని అన్నారు. పవన్ కళ్యాణ్ పిచ్చికుక్క… ఆయన వాగుడుతో అది తేట తెళ్ళమైందన్నారు. అభివృద్ది ప్రతి గడపకు చేరాలి అని మా ముఖ్యమంత్రి తపన పడుతున్నారని అన్నారు. “మా సిద్దాంతం మూడు రాజధానులు అయితే…పవన్ కళ్యాణ్ సిద్దాంతం మూడు పెళ్లాలా?

పొద్దున బీజేపీకి విడాకులు ఇచ్చి ఇప్పుడు చంద్రబాబును పెళ్లి చేసుకున్నాడు. అధికారం కోసం ఏ పార్టీనైనా పెళ్లి…విడాకులు వీళ్ళ సిద్దాంతం. మీరు మొత్తం కలసి కట్టుగా వచ్చినా ప్రజలు మొత్తం ఒక తాటిపైకి వచ్చారు. కులాల్ని రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తారా…? జగన్ అందరి వాడు. మీ లక్ష్యం ప్రజల గుండెల్లో ఉన్న జగన్ నీ ఒడించాలనేది… ఆ తపన అలానే మిగిలిపోతుంది. మీరు ఎంతమంది కలిసి వచ్చినా జగన్ నీ ఇంచు కూడా కదల్చలేరు”. అని అన్నారు జోగి రమేష్.

Read more RELATED
Recommended to you

Latest news