ఏపీలో పరిక్షలపై మంత్రి కీలక వ్యాఖ్యలు

-

సెట్ పరీక్షలకు సర్వం సిద్దం చేశామని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఈ నెల 10 నుండి వివిధ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. మొత్తం 7 కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లు నిర్వహిస్తున్నామన్నారు. ఎంసెట్ లో సుమారు 272720 మంది నమోదు చేసుకున్నారని, పరీక్షల నిర్వహణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం పరీక్షల నిర్వహణ ఉంటుందని అన్నారు.

ఎగ్జామ్ ముందు, తర్వాత కూడా హాల్ ను సానిటైజ్ చేస్తామని ఆయన స్పష్టం చేసారు. ప్రతి సెంటర్ లో ఇసోలేషన్ రూమ్ లు అందుబాటులో ఉంచామని అన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. టీసీఎస్, ఏపీ అన్ లైన్ సంయుక్తంగా ఆన్ లైన్ ఎగ్జామ్స్ నిర్వహణ ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులకు హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తున్నామని, హాల్ టికెట్ తో పాటు పరీక్ష సెంటర్ రోడ్డు మ్యాప్ కూడా అందిస్తున్నామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version