టిడిపి ప్రభుత్వం చేసిన మోసం ఎవరూ మర్చిపోలేదు: మంత్రి కొడాలి నాని

-

టిడిపి అధ్యక్షుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై మంత్రి కొడాలి నాని మరోసారి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాజధాని వికేంద్రీకరణ పై గవర్నర్ అధికార పార్టీకి అనుకూలంగా ఆమోదముద్ర వేశారని చంద్రబాబు నాయుడు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. నిన్న మీడియా వేదికగా చంద్రబాబు నాయుడు ఈ విషయంపై తన స్పందనను ఈ విధంగా తెలిపారు…రాజధాని అంశంపై మాట్లాడుతూ టిడిపి అధినేత చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. అమరావతి ప్రాజెక్టును చంపేస్తుంటే కన్నీరు వస్తోందన్న చంద్రబాబు… అమరావతి తన కోసం కాదని అందరూ ఏదో రోజు తెలుసుకుంటారని పేర్కొన్నారు. ఇవాళ్టి తన మీడియా సమావేశం చరిత్రలో నిలిచిపోతుందని చంద్రబాబు చెప్పారు.

అయితే ఈ వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించిన మంత్రి కొడాలి నాని.. చంద్రబాబు దగ్గర ఉన్న 20 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో మళ్ళీ 20 సీట్లలో టీడీపీ విజయం సాధిస్తే అధికార ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణ పై మరల ఆలోచిస్తుందని అన్నారు. టిడిపి ప్రభుత్వం గతంలో తీసుకున్న అనేక పిచ్చి నిర్ణయాల వలన ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించి కూర్చోబెట్టారని.. అయినా బుద్ధి లేకుండా రాజధాని విషయంలో అనవసర కామెంట్లు చేస్తున్నారని ఫైరయ్యారు. కృష్ణ గుంటూరు కథలు టిడిపి ప్రభుత్వం చేసిన మోసాలను మర్చిపోలేదని అందుకే నారా లోకేష్ మంగళగిరి నుంచి ఓడించారని అన్నారు.రాయలసీమ జిల్లాలో మొత్తం 52 సీట్లు ఉండగా అందులో కేవలం టిడిపి రెండు సీట్లు మాత్రమే గెలుచుకొని అది కూడా బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు మాత్రమే గెలిచారని కొడాలి నాని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news