ప్రజలు ఓడించినా చంద్రబాబులో మార్పు రావడం లేదు – మంత్రి కొట్టు సత్యనారాయణ

-

టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి కొట్టు సత్యనారాయణ. చంద్రబాబు సీఎం జగన్ కు అడ్డంకులు సృష్టించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఆయనని ఓడించినా ఇంకా ఆయనలో మార్పు రావడం లేదన్నారు.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన స్కాంలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని.. మొన్న అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా బయట పెట్టినట్లు తెలిపారు. ఎల్లో మీడియా, చంద్రబాబు, దత్తపుత్రుడు కలిసి మాపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. లక్షల కోట్లు దోచుకున్నారు కాబట్టే గత ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news