హైదరాబాద్: పీవీ మార్గ్ అంబేద్కర్ నగర్లో జీహెచ్ఎంసీ నిర్మించిన 330 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రులు కేటీఆర్, తలసాని ప్రారంభించారు. ఇళ్ల పత్రాలను లబ్దిదారులకు అందజేశారు. ఈ నెల 28 , జులై 1, 5 వ తేదీల్లో కూడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు మంత్రి కేటీఆర్ పంపిణీ చేయనున్నారు.
మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పేదలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమన్నారు. పేదలకు కట్టించి ఇస్తున్న ఒక్కో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కోటిపది లక్షల రూపాయల విలువ ఉంటుందని తెలిపారు. పండగ వాతావరణంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభించుకున్నామని చెప్పారు.