ఎల్లుండి నెల్లూరు జిల్లాలో మంత్రి మేకపాటి అంత్యక్రియలు

-

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి.. కాసేపటి క్రితమే మృతి చెందిన సంగతి తెలిసిందే. గుండె పోటు రావడంతో.. మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి.. మరణించారు. దీంతో వైసీపీ పార్టీ లో విషాదం చోటు చేసుకుంది. అయితే.. ఎల్లుండి నెల్లూరు జిల్లా బ్రాహ్మణపల్లిలోమంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్య క్రియలు నిర్వహించనున్నారు.

ఇవాళ రాత్రికి హైదరాబాద్ నుండి నెల్లూరు కి గౌతం రెడ్డి పార్థివ దేహం తరలించనున్నారు ఆయన కుటుంబ సభ్యులు. రేపు నెల్లూరు లో అభిమానుల కోసం పార్థివ దేహం‌ ఉంచనున్నారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులు. అమెరికాలో చదువుతున్నారు గౌతమ్‌ రెడ్డి కుమారుడు. అయితే…కుమారుడు వచ్చాకనే గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి మరణ వార్త విన్న ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.. హుటా హుటిన హైదరాబాద్‌ బయలు దేరారు.ప్రత్యేక హెలికాప్టర్‌ లో సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి హైదరాబాద్‌ వస్తున్నారు. నేరుగా జూబ్లిహిల్స్‌ అపోలో ఆస్పత్రికి సీఎం జగన్‌ వెళ్లనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version