సర్వేలు , ప్రజలు అంతా YCP కే అనుకూలం: మంత్రి పెద్దిరెడ్డి

-

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగడానికి ఇంకా ఆరు నెలల సమయం మాత్రమే ఉన్నది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మంచి ప్లానింగ్ తో ముందుకు వెళ్లిన రాజకీయ పార్టీకి ఎక్కువగా విజయావకాశాలు ఉంటాయి. ఎన్నికల గురించి మరియు ప్రస్తుతం రాష్ర్టంలో అనుకూల పవనాలు ఎవరికీ వీస్తున్నాయి అన్న విషయం గురించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొన్ని కామెంట్ చేశారు. అవేమిటని చూస్తే… రాబోయే ఎన్నికల్లో అధికార వైసీపీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారని క్లారిటీ గా చెప్పారు.. ఇంకా ఒకడుగు ముందుకు వేసి ఏపీలో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాలను వైసీపీ దక్కించుకుంటుంది అని ఆశాభావాన్ని వ్యక్తం చేయడం విశేషం. ప్రజలు మరియు సర్వేలు అన్నీ కూడా వైసీపీకి 175 కి 175 సీట్లు వస్తాయని నమ్మకాన్ని కలిగిస్తున్నాయని పెద్దిరెడ్డి చెప్పారు.

మరి పెద్దిరెడ్డి మాటలను బట్టి వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఒక్క సీటు కూడా గెలుచుకునే అవకాశం ఇవ్వరా ? అంటూ రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. ఇక వస్తావా పరిస్థితులు ఏ విధంగా ఉండనున్నాయి అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news