ఖలిస్థానీ గ్యాంగ్‌స్టర్లపై NIA ఉక్కుపాదం.. ఆరు రాష్ట్రాల్లో తనిఖీలు

-

ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యతో కెనడా-భారత్​ల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఖలిస్థానీలు దేశానికి ముప్పని భావిస్తున్న భారత్​.. వారిపై కొరఢా ఝళిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ) అధికారులను రంగంలోకి దింపింది కేంద్ర సర్కార్. ఎన్​ఐఏ అధికారులు ఖలిస్థానీ ముఠాలపై.. వారి అనుచరులపై ఉక్కుపాదం మోపుతున్నారు.

కెనడాలోని ఖలిస్థానీ సంస్థకు మద్దతిస్తున్న భారతీయ ముఠాలను ఎన్​ఐఏ ఏరిపారేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆరు రాష్ట్రాల్లో తనిఖీలు చేపడుతోంది. ఆరు రాష్ట్రాల్లో ఖలిస్థాన్ గ్యాంగ్‌స్టర్లు, వారి అనుచరులను లక్ష్యంగా చేసుకుని సోదాలు చేస్తోంది. ఇవాళ తెల్లవారుజామున నుంచే ఎన్​ఐఏ బృందాలు ఆరు రాష్ట్రాల్లోని 51 ప్రాంతాల్లో స్థానిక పోలీసుల సహకారంతో దాడులకు దిగాయి.

లారెన్స్, బాంబిహా, అర్ష డాలా ముఠాలను ఎన్​ఐఏ లక్ష్యంగా చేసుకుంది. గ్యాంగ్‌స్టర్లు… లారెన్స్‌ బిష్ణోయ్‌, జస్‌దీప్‌ సింగ్‌, కాలా జతేరి అలియాస్‌ సందీప్, వీరేందర్ ప్రతాప్‌ అలియాస్‌ కాలా రాణా, జోగిందర్ సింగ్‌ల చిత్రాలను.. ఇటీవల ఎన్​ఐఏ ఎక్స్‌(ట్విట్టర్​)లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులో పేర్కొన్న వారి పేరుతోగానీ, వారి అనుచరుల పేరిటగానీ ఉన్న ఆస్తులు, వ్యాపారాలు, వారి వ్యాపార భాగస్వామ్యులు, వారి కోసం పనిచేసే ఉద్యోగులు, కలెక్షన్‌ ఏజెంట్ల వివరాలను తమకు తెలపాలని ఎన్​ఐఏ కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news