నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలోనే విద్యాశాఖలో 20 వేల పోస్టులు భర్తీ

-

తెలంగాణలోని నిరుద్యోగులుకు మరో శుభవార్త. త్వరలోనే విద్యాశాఖలో 20 వేల పోస్టులు భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆమె రంగారెడ్డి జిల్లా ఆమనగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి భూమిపూజ, లబ్దిదారులకు దళిత బంధు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఆమనగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మూడు కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు.

గురుకుల పాఠశాలలో సుమారుగా నాలుగు లక్షల మంది పిల్లలు చదువుతున్నారని, 12 వందల కోట్లతో పాఠశాలకు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు.అంతేకాకుండా విద్య శాఖలో త్వరలో 20 వేల పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభం చేస్తున్నట్లు, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పథకాలు అమలవుతున్నాయన్నారు. దళిత బంధు లాగా మిగతా వర్గాలకు కూడా త్వరలో అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టనున్నట్లు ఆమె వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version