మంత్రి విశ్వరూప్‌కు 10 గంటల పాటు గుండె శస్త్రచికిత్స !

-

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన పినిపె విశ్వరూప్‌‌.. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన గెలుపొందారు. అయితే.. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో ఉన్నారు. ఏపీ మంత్రి పినిపే విశ్వరూప్ సర్జరీ విజయవంతం అయింది.

ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఆసుపత్రిలో సోమవారం నిర్వహించిన గుండె శస్త్రచికిత్స విజయవంతమైనట్లు తెలిపారు. ఆయనకు గుండెలో ఆరు చోట్ల వాల్వులు, బ్లాక్ కావడంతో డాక్టర్లు ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ శస్త్రచికిత్స జరిగిందని మంత్రి విశ్వరూప్ కుమారుడు కృష్ణారెడ్డి చెప్పారు.

మరోవైపు మంత్రి విశ్వరూప్ ను సర్జరీకి ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్ లో పరామర్శించారు. మంత్రికి సీఎం జగన్ ధైర్యం చెప్పారు. మంత్రి సతీమణి బేబీ మీనాక్షి, కుమారుడు కృష్ణారెడ్డి లతో కూడా సీఎం మాట్లాడారు. తాను అన్నివేళలా అందుబాటులో ఉంటానని, విశ్వరూప్ ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడుతుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version