జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రులు..?

-

తెలంగాణ ఉద్యమ పోరాటం లో ప్రొఫెసర్ జయశంకర్ ఎంత కీలక పాత్ర వహించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్ కు దిశానిర్దేశం చేసి… తెలంగాణ ఉద్యమానికి జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి జయశంకర్. అయితే తాజాగా టిఆర్ఎస్ ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లు కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రులు జయశంకర్ సార్ తెలంగాణ బంగారు తెలంగాణ రాష్ట్రం కావాలని ఎంతగానో ఆకాంక్షించారు… అందుకే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటాన్ని ముందుండి నడిపించారు అంటూ పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అన్ని విధాలుగా దోపిడికి గురైంది అని భావించి ప్రజలు ఉద్యమించాలని జయశంకర్ సార్ పిలుపునిచ్చారు అంటూ మంత్రులు వ్యాఖ్యానించారు. జయశంకర్ సార్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news