నేడు యాదాద్రిలో మంత్రుల పర్యటన.. భద్రత కట్టుదిట్టం

-

తెలంగాణ మంత్రులు నేడు యాదాద్రి జిల్లాలో పర్యటించనున్నారు.రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ చామల కలిసి ఉమ్మడిగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్నారు.ఈ క్రమంలోనే ఆలయ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించినట్లు సమాచారం.

ఇదిలాఉండగా, యాదాద్రి ఆలయ బోర్డును ఏర్పాట్లు చేయనున్నట్లు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాదిరిగా తెలంగాణలో యాదాద్రి ఆలయ బోర్డును ఏర్పాటు చేసి టెంపుల్ డెవలప్మెంట్ చేయనున్నట్లు సమాచారం. రానున్న రొజుల్లొ టెంపుల్ ఆర్థికవిధివిధానాలు, హుండీ కానుకలకు సంబంధించిన లెక్కలను ఇకపై ఆలయ బోర్డు చూసుకుంటుందని తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news