కాంగ్రెస్ సర్కారుపై ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు

-

పాతబస్తీలోని మూసీ పరివాహక ప్రాంతంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఎంఐఎం పార్టీ బాధితులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం ఓవైసీ మీడియాతో మాట్లాడుతూ..ఖరీదైన ఇళ్లు వదిలేసి వెళ్లమంటే ఎలా వెళ్తారు? ఎక్కడికి వెళ్తారని ప్రభుత్వంపై సీరియస్ అయ్యారు.ఎన్నో డబ్బులు ఖర్చు చేసి ఇష్టంగా కట్టుకున్న ఖరీదైన ఇళ్లను కూల్చివేసి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు.

ఎంఐఎం పార్టీ ఏనాడూ ప్రభుత్వాలకు తలొగ్గలేదన్నారు. అన్ని పార్టీలు మూసీపై రాజకీయాలు చేస్తున్నాయని, వ్యాపారాలు ఉన్నచోటే ప్రజలు ఇళ్లు కట్టుకున్నారని..ఇప్పుడు ఉన్నపళంగా కూల్చివేస్తే ఎక్కడికో వెళ్లి ఎలా వ్యాపారాలు చేస్తారన్నారు. మూసీ బాధితులు ఎవరూ భయాందోళన చెందాల్సిన పనిలేదని, తాము అండగా ఉంటామని భరోసానిచ్చారు.పేదల ఇళ్లు కూలుస్తామంటే ఎట్టిపరిస్థితుల్లో ఊరుకోమని, తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని స్పష్టంచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news