కాసేపట్లో ఈడీ విచారణకు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి

-

మరి కాసేపట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరుకానున్నారు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి. ఈడి విచారణకు గడువు కావాలని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కాసేపటికి క్రితం చేసిన విజ్ఞప్తిని ఈడి తిరస్కరించిన విషయం తెలిసిందే. అయ్యప్ప మాలలో ఉన్నందున సంక్రాంతి తర్వాత విచారణకు వస్తానని తన పిఏ శ్రవన్ తో ఈడీ ఆఫీసుకు లేక పంపారు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.

ఆ తర్వాత ఉదయం సీఎం కేసీఆర్ తో భేటీ అయిన అనంతరం విచారణకు రాలేనంటూ రోహిత్ రెడ్డి ఈడికి లెటర్ పంపారు. ఈనెల 25వ తేదీ వరకు విచారణకు రాలేనని లెటర్ లో స్పష్టం చేశారు పైలట్ రోహిత్ రెడ్డి. అయితే ఆయన విజ్ఞప్తిని ఈడీ తిరస్కరించింది. ఎట్టి పరిస్థితుల్లో విచారణకు హాజరు కావాల్సిందేనని ఈడి ఆదేశించడంతో ఆయన ఈడీ కార్యాలయానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కాసేపట్లో ఈడి ఆఫీస్ కి వెళ్ళనున్నారు రోహిత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news