కేంద్రం ఇచ్చిన రైల్వే లైన్‌కు రాష్ట్ర ప్రభుత్వం బొమ్మలు పెట్టుకొని మురుస్తుంది

-

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు హరీష్‌ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యూపీఏ ప్రభుత్వం హయాంలో 250 కోట్లు సిద్దిపేట రైల్వే జోన్ కు మంజూరు చేసిందని గుర్తు చేశారు. 2016వ సంవత్సరంలో గజ్వేల్ కు మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి వచ్చిప్పుడు ప్రధాని మోదీ గజ్వేల్ రైల్వేకు శంకుస్థాపన చేసి వెళ్లారని ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సాంక్షన్ చేసిన రైల్వే లైన్ కు రాష్ట్ర ప్రభుత్వం బొమ్మలు పెట్టుకొని మురుస్తుందని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.

ఈరోజు(అక్టోబర్ 03) సికింద్రాబాద్ నుంచి సిద్దిపేటకు రైలు ప్రారంభం చేసిన సందర్భంగా మంత్రి హరీష్ రావు వందమందిని పిలిపించి స్టేజ్ పైకి ప్రోటోకాల్ ప్రకారం కూడా పిలవలేదని ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. రైల్వే స్టేషన్ డిస్ప్లేలో ప్రధాని మోదీ ఫోటోలు కూడా కనిపించలేదని మండిపడ్డారు. ప్రధాని మోదీ బొమ్మలను తన్నినందుకు, ఫ్లెక్సీలు చింపినందుకు మంత్రిపైనా సెక్షన్ 3 కింద కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ రైల్వే స్టేషన్ ను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version