బ్రేకింగ్‌ : వైసీపీ నేతలపై కేసు పెట్టిన ఎమ్మెల్యే రోజా !

-

వైసీపీ పార్టీ నేతలకు నగిరి ఎమ్మెల్యే రోజా దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చారు. తాజాగా… చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ను కలిసిన నగిరి ఎమ్మెల్యే రోజా… వైసిపి కోవర్టుల పై చర్యలు తీసుకోండని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వైసీపీ లో ఉంటూ టీడీపీతో జత కలిసి వారిని ఉపేక్షించబోమని… రాష్ట్ర డిజిపి ఫోటోలతోనూ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫొటోలను ఫ్లెక్సీల్లో వేసుకుని అధికారులను బెదిరిస్తున్నారని.. గతంలో సస్పెండ్ అయిన వారు వైసిపి పేరు చెప్పుకుంటూ తిరుగుతున్నారని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు ఎమ్మెల్యే రోజా. ఈ విషయాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళానని.. వైసీపీ పార్టీలోనే ఉంటూ పార్టీ కి చెడ్డపేరు తీసుకొస్తున్నారని ఎమ్మెల్యే రోజా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అలాంటి వారి పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని…వైసీపీ ఎమ్మెల్యే రోజా డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version