స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్ల కు నేటితో ముగియనున్న గడువు..!

-

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్ల కు నేటితో గడువు ముగియనుంది. ఇప్పటికే టిఆర్ఎస్ అభ్యర్థులను ఫైనల్ కేసీఆర్ ఫైనల్ చేశారు. నిన్న శంబిపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డి, డాక్టర్ యాదవ రెడ్డి లు నామినేషన్ లు వేశారు. ఈ రోజు కవిత, కసిరెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, తాత మధు, దండే విఠల్ ఇతర జిల్లాల అధ్యక్షులు నామినేషన్ లు దాకలు చేయనున్నారు.

ఏడు స్థానాల్లో కేసీఆర్ సిట్టింగ్ లకే ఛాన్స్ ఇచ్చారు. అంతే కాకుండా ఐదు స్థానాల్లో సిట్టింగ్ లకు హ్యాండ్ ఇచ్చి కొత్త వారికి అవకాశం కల్పించారు. మరోవైపు ఎమ్మెల్సీ బరిలో పోటీ పై కాంగ్రెస్ తర్జన భర్జన పడుతోంది. మెదక్, ఖమ్మంలో పోటీ పై కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వనుంది. మెదక్ అభ్యర్థిగా జగ్గారెడ్డి భార్య నిర్మలను కాంగ్రెస్ బరిలో దింపే ప్రయత్నం చేస్తోంది. ఖమ్మం అభ్యర్థిగా రాయల నాగేశ్వర్ రావును పరిశీలనలో ఉంచింది.

Read more RELATED
Recommended to you

Latest news