దిల్లీ లిక్కర్ స్కామ్ లో నెమ్మదిగా ఎమ్మెల్సీ కవిత మెడకు ఉచ్చు బిగుస్తోంది. దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా రిమాండ్ రిపోర్టులో ఈడీ కీలక విషయాలు పేర్కొంది. 58 పేజీల రిమాండ్ రిపోర్ట్లో రాజకీయ, ఆర్థిక, నేరపూరిత వ్యవహారాలు బయటపెట్టింది. దిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం సిసోదియాతో కవితకు రాజకీయ అవగాహన ఉందని బుచ్చిబాబు తన వాగ్మూలంలో చెప్పినట్లు ఈడీ వివరించింది.
విజయ్నాయర్ను కవిత 2021 మార్చి 19, 20 తేదీల్లో కలిశారని.. మద్యం విధానంలో ఎలా మార్పు చేస్తామనే విషయాలను కవితకు విజయ్నాయర్ వివరించారని బుచ్చిబాబు తెలిపారని ఈడీ వివరించింది. కేజ్రీవాల్,సిసోదియా తరపున విజయ్నాయర్ మద్యం విధానంపై పని చేశారని చెప్పారని తెలిపింది. మద్యం విధానంలో కవితకు అనుకూలమైన మార్పులు చేస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి నిధులు ఇచ్చేలా అవగాహన కుదిరిందని రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించింది.
మాగుంట రాఘవకు 32.5 శాతం, కవితకు 32.5 శాతం, సమీర్ మహేంద్రుకు 35 శాతం ఇండో స్పిరిట్స్లో వాటా కుదిరిందని బుచ్చిబాబు చెప్పారని ఈడీ తెలిపింది. మద్యం విధానం అధికారికంగా విడుదల చేయడానికి రెండు రోజుల ముందే బుచ్చిబాబు చేతిలోకి వచ్చిందని వివరించింది. మద్యం విధానంలో కొన్ని భాగాలను బుచ్చిబాబు మొబైల్ ఫోన్లో గుర్తించినట్లు ఈడీ స్పష్టం చేసింది.