రేవంత్ రెడ్డి నోటి తిట ఎక్కువ అయ్యింది …తిట తీరుస్తాం – పల్లా

-

రేవంత్ రెడ్డి నోటి తిట ఎక్కువ అయ్యింది …తిట తీరుస్తామని హెచ్చరించారు తెరాసా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత బ్లాక్ మెయిలర్ రేవంత్ అని ఫైర్ అయ్యారు. రేవంత్ ఏం తెలుసురా బిడ్డ నీకు…తెలంగాణ సాయుధ పోరాటం గురించి అంటూ నిప్పులు చెరిగారు.

కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జరిగింది తెలంగాణ సాయుధ పోరాటమన్నారు. రైతు సంఘర్షణ సభ కాదు….కాంగ్రెస్ ఘర్షణ సభ అని పెట్టుకో అని రేవంత్ రెడ్డికి చురకలంటించారు. రేవంత్ ….నీవే పెద్ద డ్రగ్ ఆడిక్ట్ అని…ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాలుక చీరేస్తామని హెచ్చరించారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.

కిషన్ రెడ్డి రైస్ మిల్లర్లను fci అధికారులతో విచారణ చేస్తామని అంటున్నారు…మిల్లర్లు రైతుల నుంచి వడ్లు కొనకుండా కిషన్ రెడ్డి భయపెడుతున్నారని ఆగ్రహించారు. రేవంత్ ఏమో సీబీఐ విచారణ అంటున్నారు…కిషన్ రెడ్డి ,రేవంత్ రెడ్డిలు చిల్లర గాళ్ళు ఆని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version