మార్చి 4న రాష్ట్రంలో మోడీ పర్యటన..!

-

తెలంగాణలో బిజెపి అగ్ర నేతలు వరుస ఎన్నికలు పర్యటనలు సిద్ధమవుతున్నారు లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుండి కనీసం 10 ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రచారాన్ని ప్రారంభించక ముందే బిజెపి ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఈ నెలాఖరులోగా అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించి ఎన్నికల ప్రచారం చేయడానికి బిజెపి నిర్ణయం తీసుకుంది. ప్రధాన నరేంద్ర మోడీ రాష్ట్రంలో పర్యటించి సభలో నిర్వహించేందుకు సన్నదం అవుతున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే అదిలాబాద్, సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన సభలను మోడీ సందర్శించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు వచ్చే నెల నాలుగున హైదరాబాద్లో అమిత్ షా లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొబోతున్నారు. నాలుగవ తేదీ మోడీ రాష్ట్రానికి రాబోతున్నారు ఈ క్రమంలో ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news