మోదీ మూడోసారి ప్రధాని అవుతారు: పవన్ కళ్యాణ్

-

ప్రధాని నరేంద్ర మోడీ నామినేషన్ దాఖలు చేసే తేదీ ఫిక్స్ చేశారు. వారణాసి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మోడీ ఈ నెల 14వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్న విషయం తెలిసిందే.ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమిలోని ప్రధాని పార్టీల నేతలను మోదీ ఆహ్వానించారు.ఇందులో భాగంగా తన నామినేషన్ కార్యక్రమానికి రావాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి మోదీ ఆహ్వానం అందింది.

అంతేకాకుండా ఈ కార్యక్రమానికి జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ‘ ఎన్డీఏ కూటమి తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మోదీకి శుభాకాంక్షలు, మద్దతు తెలిపేందుకు ఆయన పక్కన ఉండటం గౌరవంగా భావిస్తున్నా. మోదీ మూడోసారి ప్రధాని అవుతారు’ అని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రస్తుతం వారణాసి సిట్టింగ్ ఎంపీగా ఉన్న మోడీ మరోసారి అక్కడి నుండి బరిలోకి దిగుతోన్న సంగతి తెలిసిందే. ఇక, వారణాసిలో ప్రధాని మోడీపై యూపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అజయ రాయ్ పోటీకి దిగుతున్నారు. వారణాసిలో పోలింగ్ జూన్ 1వ తేదీన చివరి దశలో జరగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version