IPL 2024 : రాజస్థాన్ రాయల్స్ కి షాక్.. కీలక ఆటగాడు దూరం

-

రాజస్థాన్ రాయల్స్ జట్టుకి భారీ ఎదురు దెబ్బ తగిలింది.రాజస్థాన్ రాయల్స్ కీలక ఆటగాడు జోస్ బట్లర్ జట్టును వీడారు. ఈ సీజన్లో మిగిలిన మ్యాచ్లకు అతడు అందుబాటులో ఉండరు. మరికొన్ని రోజుల్లో జూన్‌ 2 నుంచి 29 వరకూ అమెరికా, వెస్ట్ ఇండీస్ వేదికగా టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బట్లర్ స్వదేశానికి పయనమయ్యారు. ఇక రాజస్థాన్ రాయల్స్ ఇప్పటివరకు ఆయన 12 మ్యాచ్లలో 8 గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది.

అలాగే మరికొన్ని జట్లకి కూడా కీలక ఆటగాళ్లు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. మొయిన్ అలీ(చెన్నై సూపర్ కింగ్స్ ), బెయిర్స్టా(పంజాబ్ కింగ్స్), సామ్ కరన్(పంజాబ్ కింగ్స్), విల్ జాక్స్(రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ), ఫిల్ సాల్ట్(కోల్‌కతా నైట్ రైడర్స్), రీస్ టోప్లీ(రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ) సైతం త్వరలో టోర్నీకి దూరమయ్యే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version