ఆహాలో హోస్ట్ గా డైలాగ్ కింగ్ మోహన్ బాబు..?

-

అల్లు వారి ఓటీటీ ఆహాలో ప్రేక్షకులను ఆకట్టుకునే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆహాలో సమంత టాక్ షో పేరుతో ఒక షో నిర్వహించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా నటసింహం నందమూరి బాలయ్య తో కూడా ఆహా ఒక టాక్ షోను ప్లాన్ చేసింది. నవంబర్ 4 నుండి బాలయ్య టాక్ షో ప్రసారం కానుంది. అంతేకాకుండా ఈ టాక్ షో కోసం బాలయ్య ఏకంగా 5 కోట్ల రెమ్యూనరేషన్ తీర్చుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది.

అదేవిధంగా మొదటి ఎపిసోడ్ లో బాలయ్య మోహన్ బాబు కుటుంబంతో ముచ్చటిస్తారని తెలుస్తోంది. అయితే తాజాగా మరో వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఆహా కోసం హోస్ట్ గా మోహన్ బాబు ని కూడా రంగంలోకి దింపుతున్నారట. మోహన్ బాబు తో ఆహా ఒక టాక్ షోను ప్లాన్ చేసిందట. అంతేకాకుండా మంచు లక్ష్మి తో కూడా ఆహా కోసం వంటల ప్రోగ్రామ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆహా టీం మోహన్బాబుతో ఈ విషయమై సంప్రదింపులు కూడా జరుపుతున్నారని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news