బ్రేకింగ్‌: బీజేపీలోకి సినీ నటుడు మోహన్‌బాబు.. అందుకేనా..?

-

ప్ర‌ముఖ సినీ న‌టుడు మోహన్‌బాబు అతి త్వ‌ర‌లోనే క‌మ‌లం గూటికి చేర‌నున్న‌ట్టు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీతో మోహన్‌బాబు సోమవారం భేటీ అయ్యారు. ప్రధానితో భేటీ అయిన సమయంలో ఆయనతో పాటు కుమారుడు మంచు విష్ణు, కుమార్తె లక్ష్మీ ప్రసన్న, కోడలు విరోనిక ఉన్నట్లు తెలిసింది. దాదాపు అరగంటకు పైగా ప్రధాని మోదీతో మోహన్‌బాబు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా.. బీజేపీలో చేరాలని మోహన్‌బాబును మోదీ ఆహ్వానించినట్లు తెలిసింది. అందుకు ఆయన కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ ఓ ట్వీట్ చేశారు. డైనమిక్ లీడర్‌ను కలిశానని ట్వీట్‌లో కామెంట్ పెట్టారు. దీన్ని బట్టీ మంచు ఫ్యామిలీ మొత్తం బీజేపీ గూటికి చేరబోతున్నట్లు తెలుస్తోంది.

అలాగే సోమవారం సాయంత్రం 6 గంటలకు బీజేపీలో నెంబర్ 2 నేతగా కీలకంగా వ్యవహరిస్తున్న కేంద్ర మంత్రి అమిత్ షాను కూడా మోహన్‌బాబు కలవనున్నట్లు తెలిసింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే రేపోమాపో ఆయన కమలం కండువా కప్పుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కాగా, ప్రస్తుతం మోహన్ బాబు వైసీపీలో ఉన్నారు. ఎన్నికల ముందు ఆయన ‘ఫ్యాన్’ పార్టీలో చేరారు. జగన్ ముఖ్యమంత్రి అయితే తనకు కీలక పదవి ఖాయమని ఆయన భావించారు. జగన్ సీఎం అయ్యారు గానీ మోహన్ బాబు ఆశించింది జరగలేదని, అందుకే ఆయన కొన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version