అన్నమయ్య జిల్లాలో విషాదం.. తల్లి, ముగ్గురు పిల్లలు ఆత్మహత్య

-

ఏపీలోని అన్నమయ్య జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ తల్లి తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. గాలివీడు పంచాయతీ చిలుకలూరిపేటలోని వెలిగల్లు ప్రాజెక్టు వద్ద గండిమడుగులో పిల్లలతో సహా దూకింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్యకు పాల్పడిందని స్థానికులు అంటున్నారు. మృతులను నాగరాణి (30), 10 ఏళ్లలోపు పిల్లలుగా గుర్తించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానికులు, ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతికి గల కారణాలపై కుటుంబాన్ని ఆరా తీశారు. మరోవైపు కుటుంబ కలహాలతోనే ఆత్మహత్యకు యత్నించి ఉండొచ్చని స్థానికులు పోలీసులతో చెప్పడంతో ఆ దిశగా వారు దర్యాప్తు చేస్తున్నారు. నలుగురి మరణంతో చిలుకలూరి పేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news