ప్రియుడి మోజులో పడి భర్తను, 22 ఏళ్ల కూతురిని హత్య చేసింది ఓ కసాయి తల్లి. కూతురిని హత్య చేసి అడవిలో మృతదేహం పడేసి, చుట్టూ క్షుద్రపూజలు చేసినట్లు సృష్టించింది కిల్లర్ లేడీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వడితల గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. భర్త పక్షవాతంతో బాధపడుతుండగా, అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది కవిత అనే మహిళ.

ఈ వివాహేతర సంబంధం గురించి తెలుస్తుందని భర్తను జూన్ 25న చంపి వ్యాధితో చనిపోయాడని నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేసింది. వివాహేతర సంబంధం విషయం కూతురికి కూడా ఎలాగైనా తెలుస్తుందని, ప్రియుడితో కలిసి వర్షిణి(22)ను కూడా కడతేర్చింది కసాయి తల్లి. ఈ తరుణంలోనే ప్రియుడిని, కవితను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు పోలీసులు.