పిల్ల‌ల్ని ఉరి వేసి చంపి.. ఆత్మ‌హ‌త్య చేసుకున్న త‌ల్లి

-

హైద‌రాబాద్ లోని రాజేంద్ర న‌గ‌ర్ లో దారుణం చోటు చేసుకుంది. ఒక తల్లి త‌న ఇద్ద‌రి పిల్ల‌లను ఉరి వేసి చంపి.. తానూ ఆత్మ హ‌త్య చేసుకుంది. ఈ ఘ‌ట‌న లో త‌ల్లి స్వాతి తో పాటు పిల్ల‌లు శ్రేయ, త‌న్వి ముగ్గురు మృతి చెందారు. అయితే భ‌ర్త తో కోపం తో నే స్వాతి ఈ దారుణానికి పాల్ప‌డిన‌ట్టు తెలుస్తుంది. అయితే స్వాతి సాయి అనే దంప‌తులు హైద‌రాబాద్ లో ని రాజేంద్ర న‌గ‌ర్ లో నివాసం ఉంటుంన్నారు. ఇద్ద‌రు కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగాలను చేస్తున్నారు.

అయితే స్వాతి సాయి ల మ‌ధ్య‌ గ‌త కొద్ది రోజుల గొడ‌వ‌లు వ‌స్తున్నాయి. ఈ రోజు సాయంత్రం కూడా భర్తతో వివాదం జరిగింది. దీంతో భర్త ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత స్వాతి త‌న‌ పిల్లల్ని ఉరి వేసి చంపి.. తాను ఆత్మహత్య చేసుకుంది. స్వాతి చ‌నిపోయే ముందు గోడ మీద సూసైడ్ లేఖ రాసి ఆత్మహ‌త్య చేసుకుంది. భ‌ర్త సాయి వేధింపుల వ‌ల్లే తాను ఆత్మ హ‌త్య చేసుకుంటున్నానని లేఖ లో తెలిపింది. అలాగే సాయి కొన్ని సంద‌ర్భా ల లో సైకో లా త‌న‌ను వేధిస్తున్నాడ‌ని లేఖ లో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news