వైరల్‌ వీడియో : బిడ్డల కోసం విషనాగుతోనే పోరాటానికి దిగింది..!!

-

మనుషులు, జంతువులూ ఏవైనా గానీ తల్లి ప్రేమ విషయంలో ఒకటే అన్న విషయం ఈ తాజాగా వైరల్ వీడియో ను చూస్తే అర్ధం అవుతుంది. తల్లి ప్రేమ ఎంత గొప్పదో,శక్తివంతమైందో తన పిల్లలు కాపాడుకోవడం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన ఒక వడ్రంగి పిట్ట వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. విషనాగు తో వడ్రంగి పిట్ట తన పిల్లలను కాపాడుకోవడం కోసం ఏకంగా యుద్ధానికే దిగింది. చెట్టు గూడులో చొరబడి తన గుడ్లను స్వాహా చేద్దామనుకున్న ఓ భారీ పాముతో ఫైటింగ్‌ చేసింది. దాదాపు నాలుగు సార్లు దానిని ముక్కుతో పొడుస్తూ.. తరిమి కొట్టింది. 10 ఫీట్ల పొడవున్న పామును ఎదుర్కొనే క్రమంలో వడ్రంగి పిట్ట చావు అంచులదాక వెళ్లొచ్చింది. అయితే 11 ఏళ్ల క్రితం తీసిని వీడియో ఇది కాగా తాజాగా ఒక ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ ఈ వీడియో ను సోషల్ మీడియాలో షేర్ చేయడం తో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

11 ఏళ్ల క్రితం సోషల్ మీడియా ఇంతగా డెవలప్ అవ్వలేదు కాబట్టి అప్పుడు ఈ వీడియో పెద్దగా చూసి ఉండిఉండరు. కానీ తాజాగా సోషల్ మీడియాలో ఈ వీడియో కాస్త షేర్ కావడం తో ఈ వీడియో కు చాలా వ్యూస్ లభించినట్లు తెలుస్తుంది. 11 ఏళ్ళక్రితం ఇజ్రాయెల్ టూరిస్ట్ అసఫ్ అద్మోని అనే టూరిస్టు ఈ వీడియోను పెరూ దేశంలో చిత్రీకరించారు. అయితే అప్పట్లో ఈ వీడియో ను యూటూబ్‌లో పెట్టడం తో ఈ వీడియోకు 8 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. అయితే లేటెస్ట్ గా మళ్లీ ఈ వీడియో ను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నందా అన్న వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తో సోషల్ మీడియా ను ఈ వీడియో షేక్ చేసేస్తుందట.

Read more RELATED
Recommended to you

Latest news