దళితబంధు సక్రమంగా అమలు కావడం లేదంటూ మోత్కుపల్లి నిరసన

-

దళితబంధు సక్రమంగా అమలు కావడం లేదంటూ మోత్కుపల్లి నిరసన తెలిపారు. ముఖ్యంగా ఇవాళ కొద్దిసేపు హైడ్రామా సృష్టించారు మోత్కుపల్లి నరసింహింహులు. పురుగుల మందు డబ్బాతో ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లారు. కేసీఆర్ ను సమర్థించి తప్పుచేశానన్నారు మోత్కుపల్లి.దళితబంధు అమలు కాకుంటే నేను చస్తానని గతంలో చెప్పాను. దళితబంధు అమలు కావటం లేదు. నన్ను చనిపోమని దళిత యువత నాకు మెసేజ్ లు చేస్తున్నారు. యాదగిరిగుట్ట దగ్గర చెప్పిన మాటను నిలబెట్టుకోమని దళిత యువత కోరుతున్నారు.

కేసీఆర్ ముహూర్తం పెడితే గడ్డి మందు తాగి చనిపోతాను. దళితులకు అన్యాయం జరిగితే గడ్డి మందు తాగి చచ్చిపోతాను.
కేసీఆర్ గట్టిగా ఉన్నాడు.‌ ఆయన ఎలాగూ చావడు. నేనైనా చచ్చిపోతాను. నా పెద్దన్న కేసీఆర్ మాటకు విలువే లేదు. మోసాలకు కేరాఫ్ అడ్రస్ సీఎం కేసీఆర్. మా ఇద్దరకీ మాటలు లేకున్నా.. దళితబంధు పెడ్తున్నాను రావాలని స్వయంగా కేసీఆర్ పిలిస్తే వెళ్ళాను
దళితబంధుతో దళిత జాతికి మేలు జరుగుతోందని కేసీఆర్ ను సమర్థించానని చెప్పారు మోత్కుపల్లి.

Read more RELATED
Recommended to you

Latest news