రామాలయ ప్రాంగణాన్ని శుభ్రం చేసిన సినీ నటుడు..!

-

అయోధ్యలో ఈనెల 22న బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం జరుగనుంది. ఈ కార్య్రమానికి పలువురు బాలీవుడ్ నటులు హాజరుకానున్నారు. ఇంతలో ఒక నటుడికి సంబంధించిన వీడియో వైరల్ గామారింది. అందులో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్.. రామాలయ ప్రాంగణాన్ని మెట్లను శుభ్రం చేశాడు. అభిమానులు జాకీష్రాప్ ను మెచ్చుకుంటున్నారు. ః

66 ఏళ్ల జాకీ ష్రాఫ్ ముంబైలో జరిగిన పురాతన రామాలయాన్ని శుభ్రపరిచే కార్యక్రమంలో పాల్గొన్నారు. రాముడిపై ఆ నటుడికి ఉన్న భక్తిని, అతని సింప్లిసిటీని అభిమానులు కొనియాడుతున్నారు. ఎక్స్ లో షేర్ చేసిన ఈ వీడియోను యూజర్స్ అమితంగా ఇష్టపడుతున్నారు. పలువురు అభిమానులు రకరకాలుగా కామెంట్స్ కూడా చేస్తున్నారు. యూజర్ జాకీని ఉద్దేశించి జీరో నుంచి హీరోగా మారిన వ్యక్తి అని కామెంట్ చేయగా.. మరొకరు కెమెరా ముందు.. కెమెరా వెనుక అత్యంత వినయుడు అని రాశారు. జాకీ ష్రాప్ అప్పుడప్పుడు పలు సామాజిక  కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంటాడు. పేదలకు వైద్య చికిత్స చేయించేందుకు అలాంటి వారికి విద్య అందించేందుకు జాకీష్రాప్ విరాళాలు అందిస్తుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news