జగన్ పై నేనే గెలుస్తా : రఘురామ సవాల్

-

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 50 స్థానాలు మించి వైఎస్ఆర్సీపీ కి రావని జోస్యం చెప్పారు. పచ్చిమ గోదావరీ జిల్లాలో ఒకరిద్దరు తప్ప వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే లందరికీ ప్రతికూల పరిస్థితులు ఉన్నాయన్నారు. నర్సాపురం నియోజకవర్గానికి తన గెలుపును ఎవరు అపలేరని స్పష్టం చేశారు.

నర్సాపురం నియోజకవర్గం లో 9 లక్షల ఫోన్ కాల్స్ ద్వారా సర్వే చేయించానని…శాస్త్రీయమైన విధానం లో సర్వే చేయించానని తెలిపారు. నర్సాపూర్ లో ఇప్పుడు ఎన్నికలు జరిగితే.. జగన్ పోటీ చేసినా తానే గెలుస్తానని ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కంటే నాకు 19 శాతం ఓటింగ్ శాతం ఎక్కువ వచ్చిందన్నారు. ఇక చిత్తూరు జిల్లాల్లో చంద్రబాబు, పెద్ది రెడ్డి, ద్వారక నాథ్ రెడ్డి మినహా మరెవరూ మళ్లీ గెలవరని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news