ఎంపీ సంతోష్ నా భూమిని కబ్జా చేశారు: కెసిఆర్ సోదరుని కూతురు…

-

ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పై సంచలనమైన ఆరోపణలు చేశారు కేసీఆర్ సోదరుని కూతురు రేగులపాటి రమ్య రావు.అధికారాన్ని అడ్డంపెట్టుకొని సంతోష్ పెద్ద ఎత్తున భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారన్నారని ఆరోపించారు.సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సోమవారం విలేకరుల సమావేశంలో రమ్య మాట్లాడారు.2007లో ఎలగందుల లో తాను కొనుగోలు చేసిన రెండు ఎకరాల భూమిని సంతోష్ ఆక్రమించారని పేర్కొన్నారు.ఆ భూమిలో గ్రానైట్ వ్యర్థాలను నింపుతున్నారు అని తెలిపారు.2009లో రూ.7 కోట్ల ఆస్తులు ఉన్న సంతోష్ 2013లో గ్రానైట్ క్వారీ భాగస్వామ్యం తీసుకున్నారని, అప్పటి నుండి అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు.

2015లో మిడ్ మానేరు ముంపు బాధితుడు గా రెండు గుంటల పట్టా తీసుకున్న సంతోష్ కు ఇప్పుడు కోకాపేట వంటి ప్రాంతాల్లో 200 ఎకరాలు ఎక్కడినుంచి వచ్చాయి అని ప్రశ్నించారు.సంతోష్ అండదండలతో కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ మాఫియా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.తన భూమికి సంబంధించి రెవెన్యూ అధికారులతో సర్వే చేయించి అక్రమాలకు పాల్పడిన వారిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయించామన్నారు.కానీ ఆక్రమణదారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.తనలాంటి బాధితులు వందల మంది ఉన్నారని, ఓ నిజ నిర్ధారణ కమిటీ వేసి, సంతోష్ అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.తనకు తక్షణమే న్యాయం చేయకపోతే ప్రధానమంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తానని రమ్య స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news