వైసీపీకి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా

-

నెల్లూరులో వైసీపీకీ భారీ షాక్ తగిలింది. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి గుడ్బై చెప్పారు. వైసీపీ సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు వైసీపీ అధిష్ఠానానికి లేఖను పంపారు. నెల్లూరు జిల్లాలో ఎంపీ సీటుతో పాటు మరో రెండు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేయగా ,వైసీపీ అధిష్టానం నో చెప్పినట్లు సమాచారం. అలాగే నెల్లూరు సిటీ ఇంచార్జి నియామకంపై సమాచారం ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.టీటీడీ బోర్డు సభ్యురాలిగా ఉన్న ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంతి కూడా వైసీపీకి గుడ్బై చెప్పారు. వీరిద్దరూ టీడీపీలో చేరబోతున్నట్లు సమాచారం.

తొలి నుంచి పార్టీని అంటిపెట్టుకున్న నేతలు సైతం వైసీపీ నుంచి తప్పుకుంటుండడంతో ,వైసీపీపై వచ్చే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతాయని విశ్లేషకులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news