ఆ డ్రైవర్ నన్ను చంపాలని చూశాడు : మొమైత్ సంచలనం

-

తనను గోవా ట్రిప్ తీసుకు వెళ్లిన డ్రైవర్ రాజు పై సినీనటి ముమైత్ ఖాన్ పంజాగుట్ట పిఎస్ లో ఫిర్యాదు చేసింది. గతంలో మముత్ ఖాన్ తనకు డబ్బులు ఎగ్గొట్టిందని పంజాగుట్ట పిఎస్ లోనే డ్రైవర్ రాజు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా డ్రైవర్ రాజు నుంచి ప్రాణహాని ఉందని ముమైత్ ఖాన్ పేర్కొంది. డ్రైవర్ రాజు నన్ను బెదిరింపులకు గురి చేస్తున్నాడన్న ఆమె డ్రైవర్ రాజుకు నేను పూర్తి డబ్బులు పంపించానని పేర్కొంది. డబ్బుల కోసం నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, ల రాజు నన్ను తీవ్ర వేధింపులకు గురి చేశాడని ఆమె ఆరోపించారు. డ్రైవర్ రాజు నన్ను చంపేంత కూడా ప్రయత్నం చేశాడన్న ఆమె రాజు విషయమై మేనేజర్ తో పాటుగా రాజూ కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేశానని అన్నారు.

పేదవాడైన రాజుని వదిలిపెడితే నాపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రెండు రోజుల నుంచి నా పై జరుగుతున్న తప్పుడు ఆరోపణలపై ఫిర్యాదు ఇచ్చానన్న ఆమె, నాకు క్యాబ్ డ్రైవర్ ను‌ చీట్ చేయాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నించారు. కొన్ని మీడియా చానళ్లు నా పరువుకి భంగం కలిగేలా వార్తలు ప్రసారం చేశారని నా క్యారెక్టర్ ను‌ జడ్జ్ చేసే అధికారం ఏముంది ఒక్కసారి ఆలోచించండని అన్నారు. నామీద డ్రైవర్ తప్పుడు ఆరోపణలు చేశాడని, అతను చెప్పిన దాంట్లో ఎలాంటి వాస్తవం లేదని మొమైట్ పేర్కొంది. అతను రాష్ డ్రైవింగ్ చేసి నన్ను భయాందోళనకు గురి చేశాడని ఆమె చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news