పోలీసులను వణికిస్తున్న కరోనా.. ఎంత మంది మరణించారంటే..?

-

భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేశంలోని అన్నీ రాష్ట్రాలతో పోల్చుకుంటే దీని ప్రభావం మహారాష్ట్రపై అధికంగా ఉంది. దీంతో కరోనాపై పోరాటంలో ముందున్న పోలీసులు కూడా వైరస్‌ మహమ్మారి బారినపడుతున్నారు.తాజాగా.. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 77 మంది పోలీస్ సిబ్బంది కరోనా బారిన పడగా ఇద్దరు మృతి చెందారు. దీంతో ఆ పోలీస్ కుటుంబ సభ్యులు, వారితో పని చేసిన సిబ్బంది వణికిపోతున్నారు.

కాగా, మహారాష్ట్ర పోలీసు శాఖలో మొత్తం 1030 మంది కరోనాతో ఆసుపత్రిలో పోరాడుతుండగా, ఇప్పటి వరకు 59 మంది మృతి చెందారు. ఈ మేరకు మహారాష్ట్ర పొలిసు శాఖ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అప్రమత్తమైన ముంబై పోలీసుశాఖ.. కరోనా లక్షణాలున్న పోలీసులకు వైద్యసేవల కోసం రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ప్రత్యేక ఐసొలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తునట్టు రాష్ట్ర హోంమంత్రి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version