హైదరాబాద్ నడిరోడ్డున మర్డర్ చేస్తే ఒక్కరూ పట్టించుకోలేదు !

-

హైదరాబాద్ నడిబొడ్డున మనిషిని చంపినా ఒక్కరు కూడా పట్టించుకోక పోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మర్డర్ కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ మర్డర్ చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఫిరోజ్ ఖాన్ అనే రౌడీ షీటర్ ను ప్రత్యర్థి గ్యాంగ్ దారుణంగా హత్య చేసింది. ఈ హత్య జరిగి రెండ్రోజులు అయ్యాక పోలీసులు సీసీ ఫుటేజ్ సంపాదించారు.

రాత్రి 10 గంటలకు అందరూ చూస్తుండగానే హత్య జరిగినట్టు గుర్తించారు. బోరంబండ ఆర్కే సొసైటీ సమీపంలో హత్య జరిగింది. మృతుడు ఫిరోజ్ పై గతంలో భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి. రౌడీ షీటర్ వహీద్ హత్య కేసులో కూడా ఫిరోజ్ ఖాన్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ముందుగా కళ్ళలో కారం కొట్టి కత్తులతో నరికి చంపింది వహీద్ గ్యాంగ్. మొత్తం మీద హైదరాబాద్ లో రౌడీ షీటర్లు రెచ్చి పోతున్నారని చెప్పచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news