నాకు శత్రువులు సొంత పార్టీలోనే ఉన్నారు – ఎమ్మెల్యే కోటంరెడ్డి

-

సొంత పార్టీ నేతలే తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. టిడిపితో కలిసి వైసీపీకి చెందిన కొందరు నేతలు తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని.. ఈ విషయాన్ని పార్టీ అధినేత జగన్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. బాలినేని తరహాలోనే తాను కూడా ఇంటిపోరు ఎదుర్కొంటున్నారని అన్నారు. సొంత పార్టీలోనే తనకు శత్రువులు ఉన్నట్లుగా చెప్పారు.

జిల్లాకు చెందిన కొందరు వైసీపీ ముఖ్య నేతలు తన నియోజకవర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని మండిపడ్డారు. బాలినేని మూడు జిల్లాలకు ఇన్చార్జి గా ఉన్నారని.. అలాంటి వ్యక్తికి స్థానిక నేతలు అండగా ఉండాలి కానీ,అడ్డంకిగా మారకూడదని కోటంరెడ్డి అన్నారు. బాలినేని ఆత్మస్థైర్యం దెబ్బతినేలా పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని చెప్పారు. కొందరు ముఖ్య నేతలు వారి నియోజకవర్గాల్లో ఎలా గెలవాలో ఆలోచించకుండా.. ఇతరుల నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఇలాంటి పనులు పార్టీకి ఏమాత్రం మేలు చేయవని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version