విడాకులకు అప్లై చేసిన బాలీవుడ్ నటి.. భర్త హింసిస్తున్నాడని ప్రెస్‌మీట్

-

ఇటీవల కాలంలో గృహ హింస కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా బాలీవుడ్ నటి అర్జూ గోవిత్రికర్ ( Arzoo Govitrikar ) తన భర్తపై గృహ హింస కేసు పెట్టడంతో పాటు తన నుంచి విడాకులు ఇవ్వాలని కోర్టును కోరింది. తన భర్త సిద్ధార్థ్ సబర్వాల్ కొన్నేళ్లుగా తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడని ఆరోపించింది. ‘బగ్బాన్, నాగిని 2’ సీరియల్స్‌తో మంచి గుర్తింపు పొందిన నటి అర్జూ గోవిత్రికర్ జీవితం ఇలా కావడం పట్ల ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Arzoo Govitrikar | అర్జూ గోవిత్రికర్

సిద్ధార్థ్ సబర్వాల్ ను కఠినంగా శిక్షించడంతో పాటు అతడి నుంచి విడాకులు ఇప్పించాలని కోరుతున్నారు. తన భర్త నుంచి విడాకులు కోరుతూ నటి అర్జూ మీడియాతో మాట్లాడింది. తను సిద్ధార్థ్‌ను ఎంతో ప్రేమించానని, అతడితో ఎంతో సుందర జీవితాన్ని ఊహించుకున్నానని పేర్కొంది.

తన ఆశలన్నిటినీ అడియాసలుగా సిద్ధార్థ్ మార్చాడాని చెప్పింది. తనను కులం పేరుతో దూషించడాని ఆరోపించింది. తనను వేధింపులకు గురి చేస్తున్న సిద్ధార్థ్ నుంచి రక్షణ కావాలని కోరింది అర్జూ. తనను సిద్ధార్థ్ కొట్టిన సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెప్పింది. తన భర్త సిద్ధార్థ్ వేరే రూంలో ఉంటూ రష్యాకు చెందిన ఓ గర్ల్ ఫ్రెండ్‌ను మెయింటేన్ చేశాడని చెప్పింది. ఇదిలా ఉండగా కొవిడ్ వల్ల విడాకుల చర్యలు ఆలస్యమయ్యాయని, త్వరలో కోర్టులోకి ఈ విషయమ వస్తుందని సిద్ధార్థ్ తరఫు న్యాయవాది ఇషికా టోలాని తెలిపారు. ఈ క్రమంలోనే తమ అభిమాన నటికి విడాకులు మంజూరు కావాలని, ఆమె హ్యాపీగా ఉండాలని అర్జూ అభిమానులు కోరుకుంటున్నారు.

తన భర్త చేసిన గాయాల వల్ల కొద్ది రోజుల పాటు తాను బయటకు కూడా రాలేకపోయానని సంచణలన ఆరోపణ చేసింది అర్జూ. ఇంతకు మునుపు కూడా అతడిపై గృహ హింస కేసు పెట్టానని, అయినా అతడిలో మార్పు రాలేదని చెప్పింది. అందుకే చివరగా అతడి నుంచి విడాకులకు సిద్ధమైనట్లు అర్జూ చెప్పింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version