ఆ ఛాలెంజ్‌ ను ఫినిష్ చేసిన నాగబాబు..!

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనికి మంచి స్పందనే వచ్చింది. ఇప్పటికే ఎంతో మంది సినీ తారలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు చాలా మంది ఈ ఛాలెంజ్‌ ను స్వీకరించారు. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు గ్రీన్ ఇండియా చాలెంజ్ ను స్వీకరించారు.

జ‌బ‌ర్థ‌స్ట్ కమెడియన్ చమ్మక్ చంద్ర విసిరిన చాలెంజ్‌కు ఓకే చెప్పిన నాగబాబు.. హైదరాబాదు మణికొండలోని తన నివాసంలో మొక్కలు నాటారు. అనంతరం ఈ చాలెంజ్ లో భాగంగా టీవీ నటులు భరణి, కలికిరాజ్‌లను నామినేట్ చేశారు. ఈ చాలెంజ్‌ను ప్రారంభించిన టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ కు నాగబాబు ధన్యవాదాలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news