భగవంతుడు కూడా క్షమించడు..డిపాజిట్ కూడా రాదు: నల్లపరెడ్డి ప్రసన్న కుమార్

-

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నార్త్ రాజుపాలెం లో నిర్వహించిన వైయస్సార్ ఆసరా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరి షర్మిల చేస్తున్న ద్రోహానికి రాజశేఖర్ రెడ్డి ఆత్మ ఘోషిస్తుందని అన్నారు. కన్నా తండ్రి పై కేసును నమోదు చేసి అన్నని 16 నెలలు జైలుకి పంపిన పార్టీతో షర్మిల చేతులు కలపడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు.

అన్నని ఓడించాలని కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపావు. భగవంతుడు కూడా నిన్ను క్షమించడు అని అన్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కి డిపాజిట్ కూడా రాదని జోస్యం చెప్పారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి షర్మిల చేసిన దుర్మార్గానికి స్వర్గంలో ఉన్న రాజశేఖర్ రెడ్డి కూడా కంటతడి పెట్టుకుంటారని అన్నారు. పదేళ్లు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్లు నూతన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version